ప్రతిభ క్రీడాకారులకు ప్రశంసాపత్రాలు అందజేత 30 జనవరి, మంగళవారం - శ్రీసత్యసాయి జిల్లా - పుట్టపర్తి నియోజకవర్గ స్థాయిలో ఆడుదాం ఆంధ్ర టో ర్నమెంట్ లో భాగంగా ఆడుదాం ఓడిచెరువు మండలానికి చెందిన స్త్రీ,పురుష విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచారని వ్యాయామ ఉపాధ్యాయులు మంగళవారం విజయస్వప్నం ప్రతినిధికి తెలిపారు.స్త్రీల విభాగంలో వాలీబాల్,ఖోఖో పోటీల్లో ప్రధమ స్థానం సాధించారని,కబడ్డీలో ద్వితీయ స్థానం సాధించారన్నారు.పురుషుల విభాగంలో షటిల్ క్రీడల్లో ప్రధమ స్థానము,వాలీబాల్ పోటీలో తృతీయ స్థానం సాధించారన్నారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో ఎమ్మెల్యే తనయుడు కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిభ కనబరిచిన యువ క్రీడాకారులకు చేతుల మీదుగా జ్ఞాపికలు,ప్రశంసాపత్రాలు అందజేశారన్నారు.విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు నగదు బహుమతికి సంబంధించి జట్టులోని క్రీడాకారులందరూ వారి సచివాలయంలో గ్రామ కార్యదర్శిని సంప్రదించి,క్రీడాకారుల ఆధార్ కార్డు,బ్యాంక్ పాస్ పుస్తకం మొదటి పేజీ అందజేసిన అనంతరం నగదు వారి వారి ఖాతాల్లో జమ చేస్తారని డిఎస్ డిఓ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఓడిచెరువు మండల వ్యాయామ ఉపాధ్యాయులు గోపీనాథ్,జనార్ధన,రాంబాబు, సోమశేఖర్ రెడ్డి(సహాయక కోచ్) తదితరులు పాల్గొన్నారు.