ఫాదర్ ఫెర్రర్ జర్నలిస్ట్ క్రికెట్ టోర్నీ లో కదిరి కి రెండవ విజయం మడకశిర జట్టు పై కదిరి జట్టు విజయం 1 ఫిబ్రవరి, గురువారం - శ్రీసత్యసాయి జిల్లా,కదిరి - ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో అనంతపురం పట్టణ ఆర్డీటి మైదానంలో నిర్వహిస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ గురువారం రెండవరోజుకు చేరుకుంది.ముఖ్య అతిథిగా ఏపీడబ్ల్యుజేయు కార్యదర్శి విజయరాజు హాజరై టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించారు.మధ్యాహ్నం బి గ్రౌండ్ లో మడకశిర,కదిరి జట్లు తలపడగా మడకశిర టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 15ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది.బౌలర్ భారత్ మూడు ఓవర్లకు 12 పరుగులు ఇచ్చి కీలక 2 వికెట్లు తీశారు.అనంతరం బ్యాటింగ్ చేసిన కదిరి జట్టు 12.5 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.అద్భుత అట ప్రదర్శనతో లోకు 40,భరత్ రాయల్ 36 పరుగులు చేయగా చివరిలో యూనిస్,దావుద్ ధాటిగా ఆడి జట్టు విజయానికి దోహదపడ్డారు.వరుసగా రెండవసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కు ఎంపికయ్యారని జట్టు క్రీడాకారులు తెలిపారు. మరికొన్ని వార్తల కొరకు కింద లింక్ ని క్లిక్ చేయండి Click for more pics >>