జర్నలిస్టు పిల్లలకు ఉచిత క్రికెట్ శిక్షణ కొడిమి జర్నలిస్ట్ కాలనీలో ఏప్రిల్ 29 నుంచి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం 10 నుంచి 25 సంవత్సరాల వారికి శిక్షణ 20 ఏప్రిల్, శనివారం అనంతపురం - స్పోర్ట్స్ - జర్నలిస్టు పిల్లలను ఉత్తమ క్రికెటర్లుగా తీర్చడమే లక్ష్యం ప్రతిభను గుర్తించేందుకే శిక్షణా శిబిరం: మచ్చా రామలింగారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు, ఏపిడబ్ల్యూజేయూ చైర్మన్, ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్(ఏపీఎస్డీటీ)ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఏపీఎస్పిడిటి) ఆధ్వర్యంలో అనంతపురం రూరల్ మండలంలోని కోడిమి గ్రామం, కొడిమి జర్నలిస్ట్ కాలనీలో ఈనెల(ఏప్రిల్) 29వ తేదీ నుంచి జిల్లాలోని జర్నలిస్టుల పిల్లలకు, బాలురకు, మహిళా క్రికెట్ పై ఆసక్తి ఉన్న చిన్నారులకు ప్రత్యేక వేసవి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు శుక్రవారం మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు(ఏపిడబ్ల్యూజేయూ) ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ చైర్మన్ ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఏపీఎస్పిడిటి) తెలిపారు.జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టు పిల్లలను ఉత్తమ క్రికెటర్లగా తీర్చిదిద్దలనే లక్ష్యంతో వారికి మంచి శిక్షణ ఇచ్చి క్రికెటర్లుగా తయారు చేయాలన్న ఉద్దేశంతోనే జిల్లాలోని ప్రతిభ ఉన్న జర్నలిస్టు పిల్లలను,ఆసక్తి ఉన్న యువ క్రికెటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతిభ ఉన్న వారిని గుర్తించేందుకు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు.10 నుంచి 25 సంవత్సరాలలోపు ఉన్న యువకులందరూ ఈ ఉచిత క్రికెట్ శిక్షణలో పాల్గొనవచ్చునని, అందరూ ఉపయోగించుకోవాలని మచ్చా రామలింగారెడ్డి ఈసందర్భంగా కోరారు.రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా అనంతపురం జిల్లాలో కొడిమి జర్నలిస్టు కాలనీలో జర్నలిస్టుల పిల్లల కోసం ప్రత్యేకంగా ఉచితంగా క్రికెట్ శిక్షణ శిబిరం నిర్వహించడం ఒక్క రూపాయి కూడా రుసుం లేకుండా ఉచితంగా క్రికెట్ నేర్పించడం జరుగుతుందని,రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇటువంటి ఉచిత క్రికెట్ శిక్షణ లేదని మచ్చా రామలింగారెడ్డి అన్నారు. ఎక్కడ క్రికెట్ శిక్షణ జరిగిన ప్రవేశ రుసుం వసూలు చేస్తారని,అటువంటిది జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లా లో వర్కింగ్ జర్నలిస్టు పిల్లలందరికీ కొడిమిలో ఉచితంగా క్రికెట్ శిక్షణ ఇస్తున్నామన్నారు.క్రికెట్ అంటే వ్యాపారంగా మారి పేదవాడికి అందుబాటులో లేకుండా పోతున్న ఇలాంటి పరిస్థితుల్లో ఉచితంగా నేర్పించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని మచ్చా అన్నారు.ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతమున్న శ్రీసత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టు పిల్లలందరూ ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా,చిన్న పత్రికలు,సబ్ ఎడిటర్ల పిల్లలు యూట్యూబ్ ఛానల్స్ పిల్లలు ఇతర మీడియాకు సంబంధించిన వారందరూ ఈ ఉచిత శిక్షణలో పాల్గొనవచ్చునని మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. క్రికెట్ కు అవసరమైన క్రికెట్ సామాగ్రి క్రీడాకారులకు ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఉచితంగా అందిస్తోందని మచ్చా రామలింగారెడ్డి తెలిపారు.క్రికెట్ నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న జర్నలిస్టు పిల్లలు బాల బాలికలు ఈనెల 28వ తేదీ సాయంత్రంలోపు కొడిమి జర్నలిస్టు కాలనీలో క్రికెట్ అకాడమీలో ఆధార్ కార్డుతో నేరుగా వారి పేర్లను నమోదు చేసుకోవచ్చని మచ్చా తెలిపారు.ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం అనంతరం క్రికెటర్లకు ప్రముఖుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రధానం చేస్తారని మచ్చా రామలింగారెడ్డి పేర్కొంటూ.... సీనియర్ క్రికెటర్లతో క్రికెట్ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తారని, శిక్షణను ఇవ్వడానికి సీనియర్ క్రికెటర్లను ఇప్పటికే ఎంపిక చేశారని మచ్చా రామలింగారెడ్డి వివరించారు.క్రికెట్ నేర్చుకోవాలని ఆసక్తి వున్నవారు కె.విజయరాజు జిల్లా కార్యదర్శికి కొడిమి జర్నలిస్ట్ కాలనీలో దరఖాస్తులు ఇవ్వాలని, అలాగే 9490062555 నంబరులో ఇతర వివరాలకు సంప్రదించవచ్చునని మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. Click for more pics >>