శ్రీరాముడి పైన అనుచిత వ్యాక్యాలు లకు ప్రతిఘటిస్తున్న హిందూ సంస్థలు ఫెబ్రవరి 4వ తారీకు ర్యాలీకి సిద్దం 2 ఫిబ్రవరి, శుక్రవారం హైదరాబాద్ - వార్త - శ్రీరాముడి విగ్రహ ప్రతిస్థాపన సందర్భంగా అనుచిత వ్యాక్యాలు చేసినటువంటి కత్తి పద్మారావు అనే వ్యక్తి పైన హిందూ సంఘాలు కలిసి కంప్లైంట్ దరకాస్తు చేసారు. ఈనెల 4వ తారీకున హైదరాబాద్ ట్యాంక్ బ్యాండ్ వేదికగా అంబేద్కర్ విగ్రహం దెగ్గర నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామని హిందూ సంఘ నాయకులు తెలుపారు. హిందూ జనశక్తి లలిత్ కుమార్, శివశక్తి కరుణాకర్, హమారా ప్రసాద్ గారు తమ తమ నిరసనను తెలుపుతూ, ఈ సందర్భంగా ప్రజలు ఎకమవ్వాలి అని పిలుపుని ఇస్తూ, హిందువులు తమ ధర్మ పరిరక్షణ కొరకు ఏకమయ్యి ఈ నిరసనలో పాల్గొని విజయవంతం చేయాలి తెలిపారు. అంతకు ముందు శ్రీరాముడి పైన యుట్యూబ్ వేదికగా అనుచిత అసభ్య కర వ్యాక్యాలు చేసినటువంటి, ఆంధ్రప్రదేశ్కి చెందిన దళిత కవి, పండితుడు మరియు ఉద్యమకారుడు కత్తి పద్మారావు పై హిందూ జన సంఘాలు హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ స్టేషన్ లో కంప్లైంట్ దరఖాస్తు చేసారు. అధికారుల కంప్లైంట్ స్వీకరణకు సరియిన సహకారం అందించనందున హిందూ సంఘం ప్రతినిధులు తీవ్రంగా అసంతృప్తి తెలిపారు. కావును ప్రజలు కూడా ఇటువంటి వాటిపైన అవగాహన పెంచుకొని ప్రతిఘటించాలి, అని ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు లలిత్ కుమార్, కరుణాకర్, హమారా ప్రసాద్ తెలిపారు. అందరు ఈ సందర్భంగా ప్రజలు అందరు తమ తమ మద్దతుని తెలుపుతూ నిరసన రాలిలో పాల్గొని విజయయవంతం చేయాలి అని పిలుపునిచారు.